న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని అడ్డం పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కాషాయ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ టూల్ కిట్ పేరుతో బీజేపీ నేత సంబిట్ పాత్రా ట్విట్టర్ లో పలు ఆరోపణలు చేశారు. భారత్ లో కరోనా వేరియంట్ ను మోదీ స్ట్రెయిన్ గా పిలవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పార్టీ నేతలతో పాటు రాహుల్ గాంధీ సూచిస్తున్నారని బీజేపీ నేత మండిపడ్డారు.
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మీడియా సమావేశంలో సంబిట్ పాత్రా ఆరోపించారు. మహమ్మారితో తలెత్తిన పరిస్థితిని ప్రధాని మోదీ ప్రతిష్టను మసకబార్చేందుకు వాడుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోందని ఆయన ఆరోపించారు.