ఫేసుబుక్లో పరిచయం చేసుకుని.. విలువైన బహుమతులు పంపిస్తున్నామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నైజీరియాకు చెందిన ఐదుగురు సైబర్ క్రిమినల్స్పై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బుధవారం పీడీ చట్టం విధించారు. నైజీరియాకు చెందిన గాడ్స్టైమ్, ఒయిబో, ఎన్కేకి కాన్ఫిడెన్స్, ఒసాస్, డానియల్లు టూరిస్ట్, మెడికల్ వీసాలపై ఇండియాకు వచ్చి.. ఢిల్లీలో అక్రమంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సైబర్ మోసాలకు పాల్పడడానికి యూరోపియన్ దేశాలకు చెందినవారి ఫొటోలను డౌన్లోడ్ చేసుకుని.. వాటిని వారి ఫేసుబుక్ ప్రొఫైల్స్గా పెట్టి బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలో రాచకొండ కమిషనరేట్కు చెందిన పలువురిని మోసం చేయగా.. వారిని ఏప్రిల్ 4న సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వీరు బయటకు వచ్చి తిరిగి నేరాలకు పాల్పడే అవకాశం ఉండటంతో వారిపై సీపీ.. పీడీయాక్ట్ ప్రయోగించారు.