గుట్టలు, వాగులు దాటి..

20 కి.మీ కాలినడకన వెళ్లి సోలార్ప్లాంట్కు మరమ్మతులు
వాజేడు: మండలంలోని ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న పెనుగోలు గ్రామానికి శుక్రవారం మెకానిక్లు మూడు గుట్టలు, మూడు వాగులు దాటి 20 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి సోలార్ ప్లాంట్కు మరమ్మతులు చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలతో పేరూరు పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేశ్తో కలసి వారు ఆ గ్రామానికి వెళ్లారు. గ్రామంలో మరమ్మతు లకు గురైన సోలార్ ప్లాంట్ గురించి తెలుసుకున్న కలెక్టర్ ఇటీవల మండలంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించేందుకు మె కానిక్లను పంపించారు. అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించి, సోలార్ ప్లాంట్ సమస్యలపై కలెక్టర్కు వివరించేందుకు ఉదయం 7 కు వెళ్లి సాయంత్రం 6గంటలకు తిరిగి వచ్చారు. మరమ్మతులు నిర్వ హిస్తే ఆ గ్రామంలో కరంట్ సమస్య తీరనుంది.
తాజావార్తలు
- వివక్షకు తావులేదు: బైడెన్
- అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ప్రమాణ స్వీకారం
- అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణం
- ఆ నలుగురు కరోనా టీకా వల్ల చనిపోలేదు: కేంద్ర ఆరోగ్య శాఖ
- అమెరికాలో సరికొత్త రోజు : జో బైడెన్
- స్పెయిన్లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
- దీర్ఘకాలిక వీడ్కోలు కాదు.. తాత్కాలికమే : డోనాల్డ్ ట్రంప్
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి