వరంగల్ రూరల్ : ఎలాంటి అర్హతలు లేకుండా కరోనా టెస్టులు చేస్తూ డబ్బులు దండుకుంటున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..జిల్లాలోని నడికూడ మండల కేంద్రంలో ఎటువంటి అర్హతలు లేకున్నా లోకటి నాగేశ్వరరావు, కట్టగాని నాగరాజు (ల్యాబ్ టెక్నీషియన్) అనే వ్యక్తులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఇందుకు గాను ఒక్కొక్కరి వద్ద రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ కొందరు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పరకాల పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎవరైనా అనుమతులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఇన్స్పెక్టర్ పింగిలి మహేందర్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
వైద్య రంగం మరింత బలోపేతం : ఎమ్మెల్సీ కవిత
సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగల్ సీపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురు లేదు : మంత్రి గంగుల
కుందారంలో విద్యుత్ షాక్తో వదిన, మరిది మృతి
వరంగల్ జిల్లాలో 42 రెమ్డెసివర్ ఇంజక్షన్ల పట్టివేత
అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి