ఎల్బీనగర్, మే 9 : వనస్థలిపురం శ్రీకృష్ణానగర్ నుంచి సాగర్ రింగ్రోడ్డు వరకు ట్రంక్లైన్ పనులు పూర్తయితే.. 10కాలనీవాసులకు వరదనీరు, డ్రైనేజీ నీటి సమస్యల నుంచి విముక్తి లభిస్తున్నదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మ న్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఉద యం వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ఆయన శ్రీకృష్ణానగర్ నుంచి సాగర్ రింగ్రోడ్డు వరకు పాదయాత్ర చేసి.. ట్రంక్లైన్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న సమస్యల ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రంక్లైన్ నిర్మాణం కోసం రోడ్డు పక్కన అడ్డుగా ఉన్న కరెంట్ స్తంభాలను, ట్రాన్స్ఫార్మర్లను పక్కకు జరపాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ట్రాఫిక్ చిక్కుల నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం ప్రాణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ డిప్యూ టీ కమిషనర్ సురేందర్రెడ్డి, ఎలక్ట్రికల్ డీఈ విజయ్భాస్కర్రెడ్డి, ఈఈ రమేశ్బాబు, టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు, నాయకులు రవికుమార్ గుప్తా, శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.