అమరావతి: టీడీపీ నేతలు తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ట్విటర్ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘బాబు జూమ్ సొల్లును గతంలో వందల కోట్ల ప్రయోజనం పొందిన ఎల్లో మీడియా తప్ప ఎవరూ ఫాలో అవడం లేదు. అదేదో అధికారులకు డైరెక్షన్లిచ్చే సీరియస్ మీటింగులా బిల్డప్పులు. ఖాళీగా కూర్చుంటే వ్యాధులు ముదిరిపోతాయని సైకియాట్రిస్టులు చెప్పిన మీదటే తనకు తాను వర్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు.’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
‘చంద్రంకు ఓ వారం అధికారమిస్తే కరోనాను ఖతం చేస్తాడంటూ పచ్చనేతలు డబ్బా కొడుతున్నారు. రేపు కరోనాపై కరాటే అంటారేమో? దోమలపై దండయాత్ర, నీరు – చెట్టు స్కీం అంటూ కోట్లు బొక్కేశారు. రెండు రెయిన్ గన్లు తెచ్చి కరువును ఖతం చేశామన్నారు. ఇవన్నీ చూసే ప్రజలు మిమ్మల్ని పాతాళంలో పాతరేశారని’ విజయసాయిరెడ్డి విమర్శించారు.