యానాం: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చరిలో యానాం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పుదుచ్చరి మాజీ సీఎం ఎన్ రంగస్వామి పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆధిక్యంలో ఉన్నారు. మాజీ సీఎం, ఏఐఎన్ఆర్సీ చీఫ్ అయిన రంగస్వామి.. తొలి రౌండ్లో 40 ఓట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. యానాం భౌగోళికంగా ఏపీలో ఉన్నా.. ఆ నియోజకవర్గం ప్రస్తుతం పుదుచ్చరిలో ఉంది. ఈ స్థానం కోసం పోటీపడ్డ తెలుగేతర రెండో వ్యక్తిగా రంగస్వామి నిలిచారు. గతంతో మాజీ సీంఎ పీ షణ్ముగం కూడా ఈ స్థానం నుంచి పోటీ చేశారు. మాజీ సీఎం రంగస్వామి మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. తచ్చవడి నుంచి ఆయన పోటీలో ఉన్నారు. 1991 నుంచి 2011 వరకు ఆ సీటు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.