హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు ధర్మాసనం శ్రీధర్ మరణం పట్ల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారు మా హైదరాబాద్ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్నారు.
ఆయన మరణం జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విధి నిర్వహణలో ఉండే జర్నలిస్ట్ మిత్రులు తగు కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి వేముల విజ్ఞప్తి చేశారు.