ధారూరు, ఏప్రిల్ 23 : ధారూరు మండల పరిధిలోని 45 సంవత్సరాలు పై బడిన వారు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు రాజు, రమేశ్బాబు తెలిపారు. శుక్రవారం ధారూరు మండల కేంద్రంలో 46మందికి, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 19 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రమేశ్బాబు మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దవాఖాన సిబ్బంది ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు ఉన్నారు.
11 మందికి కరోనా పాజిటివ్
ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 8మందికి, ధారూరు పీహెచ్సీలో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.
మర్పల్లిలో 144 మందికి వ్యాక్సిన్
మర్పల్లి, ఏప్రిల్ 23 : మండలంలోని పట్లూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, మర్పల్లి సీహెచ్సీ రెండు సెంటర్లలో 45 ఏండ్లకు పైబడిన 144 మందికి శుక్రవారం వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ అంబిక తెలిపారు. 173 మందికి కొవిడ్-19 టెస్టులు నిర్వహించగా 38 పాజిటివ్ కేసులు వచ్చినట్లు చెప్పారు.
మోమిన్పేటలో 26 పాజిటివ్ కేసులు
మోమిన్పేట, ఏప్రిల్ 23 : మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కరోనా టెస్టులో 94 మందికి గాను 26 మందికి పాజిటివ్ వచ్చిందని, 83 మందికి కొవిడ్ టీకాలను ఇచ్చినట్లు ఇన్చార్జి వైద్యాధికారి మౌనిక సూచించారు.
బొంరాస్పేట మండలంలో 23 మందికి..
బొంరాస్పేట, ఏప్రిల్ 23 : మండలంలోని పీహెచ్సీలో శుక్రవారం 66 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 23 మందికి పాజిటివ్గా తేలిందని వైద్యాధికారి రవీంద్ర యాదవ్ తెలిపారు. అదేవిధంగా 80 మందికి కొవిడ్ టీకా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్కు తప్పక ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు.