డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రను మరో కుంభమేళాగా మార్చవద్దని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మే నెల 14 నుంచి ప్రారంభం కానున్న చార్ధామ్ యాత్ర కోసం కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో ఎలాంటి ప్రామాణిక నిర్వహణ విధానాలు సిద్ధం చేశారో తెలియజేయాలని అడిగింది.
కరోనా మహమ్మారి కట్టడి విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వ తీరు సరిగా లేదంటూ దాఖలైన పలు పిటిషన్లపై బుధవారం ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చార్ధామ్ యాత్రను మరో కుంభమేళాలా మర్చాకూడదని హైకోర్టు సూచించింది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరఫున ఈ విచారణకు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఓం ప్రకాష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. రేపు (గురువారం) జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్ర కోసం అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ విధానాలపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కట్టడి కోసం ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందనే విషయంపై కూడా రాష్ట్ర క్యాబినెట్ చర్చంచనున్నదని ఓం ప్రకాష్ కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, లాక్డౌన్ లాంటి కఠిన నిబంధనల అమలు, విద్యాసంస్థల నిర్వహణ తదితర అంశాలపై కూడా క్యాబినెట్ భేటీలో చర్చ జరుగనుందని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ప్రజలకు ఫేస్ మాస్కులు పంచిపెట్టిన దేవుళ్లు..!
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి
మామిడి పండ్లు తింటే ఇన్ని లాభాలా..!
38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఏ జైల్లోనో తెలుసా..?
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..