జయశంకర్ భూపాలపల్లి : వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో బలైన కొండ గొర్రె మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామ సమీపంలో కొండగొర్రె మాంసాన్ని విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. మాంసం, ద్విచక్రవాహనం తోపాటు 3సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం
స్వీయ నియంత్రణయే శ్రీరామ రక్ష : మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి