వెల్దుర్తి, ఏప్రిల్ 20: రైతుల సాగునీటి కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండలంలోని దామరంచ గ్రామ శివారు బంతుకమ్మ బండ వద్ద గోదావరి జలాలతో అలుగు పారుతున్న చెక్డ్యాం వద్ద మంగళవారం జడ్పీటీసీ రమేశ్గౌడ్, సర్పంచ్ భాస్కర్రెడ్డి, నాయకులు ప్రతాప్రెడ్డి, నరేందర్రెడ్డి, కిషన్రెడ్డితో కలిసి పూజలు చేసి, చీర, సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నదులకు సీఎం కేసీఆర్ కొత్త నడక నేర్పి వందల మీటర్ల ఎత్తుకు, వందల కిలోమీటర్ల దూరం గోదావరి జలాలను తీసుకువచ్చి హల్దీవాగు వదలడం అద్భుతమన్నారు. తద్వారా హల్దీవాగు పరీవాహక ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు తీరుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ కృషితో కొండపోచమ్మసాగర్ నుంచి వదిలిన గోదావరి నీళ్లతో హల్దీవాగు నిండుగా పారుతున్నదని, చెక్డ్యామ్లు నిండి మత్తళ్లు దుంకుతుండడంతో రైతుల్లో ఆత్మైస్థెర్యం పెరిగిందని, పంటల సాగుపై ధీమా ఏర్పడిందని తెలిపారు. ఎత్తిపోతల ద్వారా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు గోదావరి నీటిని అందించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. యాదాద్రి నరసింహుని ఆశీస్సులతో త్వరలోనే సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరోనాపై అందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. 45 ఏండ్లు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ శంకర్రెడ్డి, నాయకులు శేక్రెడ్డి, దుర్గారెడ్డి, మహేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, సుధాకర్రెడ్డి, సత్యంగౌడ్, నర్సింహులు, కృష్ణ, వెంకట్రెడ్డి, కుమార్, నాయకులు పాల్గొన్నారు.