కేంద్రానికి మారెడ్డి లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థి తులకు అనుగుణంగా గన్నీ సంచుల సేకరణ ధరను పెంచాలని కోరు తూ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి కేంద్ర పౌరసరఫరాల, ప్రజా పంపిణీశాఖ కార్యదర్శికి లేఖరాశారు. పాత గన్నీ సంచికి కేంద్రం రూ.7.32 ఇస్తుండగా.. పౌరసరఫరాల సంస్థ మాత్రం ఓపెన్ టెండర్ల ద్వారా రూ.29 వెచ్చించి కొనుగోలు చేస్తున్నది. దీంతో ఒక్కో సంచిపై రూ. 21.68 భారం పడుతున్నది.
యాసంగి ధాన్యం విక్రయిస్తున్న రైతులకు జాప్యంలేకుండా డబ్బు చెల్లించాలని మారెడ్డి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం సీఎం కేసీఆర్ రూ.20 వేల కోట్లు సమకూర్చినట్టు తెలిపారు. సోమవారం ఎర్రమంజిల్లోని కార్యాలయంలో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు వారంరోజుల్లో ఊపందుకుంటాయని చెప్పారు. మొత్తం 6,700 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే 1,377 కేంద్రాలను సిద్ధంచేసినట్టు తెలిపారు