45 ఏండ్లు దాటిన అందరూ వేయించుకోవాలి
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
యాదాద్రి, ఏప్రిల్16: 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో రెండో డోస్ కొవిడ్ టీకాను తీసుకుని మాట్లాడారు. టీకాపై అపోహలు పెట్టుకోవద్దని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అజ్మీరా చందూలాల్ మృతిపై సునీతామహేందర్రెడ్డి సంతాపం తెలిపారు.
టీకా కేంద్రం ప్రారంభం
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్16: మున్సిపాలిటీ పరిధిలోని ఒకటోవార్డులో కొవిడ్ టీకా కేంద్రాన్ని శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ వెన్రెడ్డి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు 10వేల వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి శివప్రసాద్రెడ్డి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
అనంతారంలో టీకా కేంద్రం..
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 16: 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని రూరల్ ఎస్ఐ సైదులు అన్నారు. మండలంలోని అనంతారంలో శుక్రవా రం కొవిడ్ టీకా కేంద్రాన్ని మండల హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో సర్పంచ్ మల్లికార్జున్తో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటేశ్, ఉప సర్పంచ్ వెంకటేశ్, వసుదా, వేణుగౌడ్, గణేశ్, మంగమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.
టీకా వేయించుకోవాలి
భువనగిరి టౌన్, ఏప్రిల్ 16: పట్టణంలోని హనుమాన్వాడలో శుక్రవారం నిర్వహించిన కొవిడ్ టీకా పంపిణీలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు పాల్గొని 45 ఏండ్లు దా టిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అనురాధ పాండు, కిరణ్కుమార్, శంకర్, భగత్, వెంకటేశ్ పాల్గొన్నారు.
45 ఏండ్లు నిండిన వారు తీసుకోవాలి
వలిగొండ, ఏప్రిల్ 16: మండల కేంద్రంతోపాటు పులిగిల్ల, వెల్వర్తి, లింగరాజుపల్లి, మల్లేపల్లి, నాగారం, గొల్నెపల్లి, నెమిలకాల్వ, జాలుకాల్వ, వర్కట్పల్లి, వేములకొండ తదితర గ్రామాల్లో శుక్రవారం మొబైల్ క్యాంపుల ద్వారా కొ విడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు వలిగొండ పీహెచ్సీ వైద్యుడు డాక్టర్ కిరణ్కుమార్ అన్నారు. 45 ఏండ్లు నిండిన వారు టీకా తీసుకోవాలన్నారు.
మాస్కులు ధరించాలి
గుండాల/ఆలేరురూరల్, ఏప్రిల్ 16: కొవిడ్ కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఎంపీపీ అమరావతీశోభన్బాబు అన్నారు. శుక్రవారం ఆమె కొవిడ్ టీకా తీసుకున్నా రు. ప్రభుత్వ వైద్యాధికారి డా.శ్రీనివాస్ మాట్లాడుతూ శుక్రవారం మండలంలో నిర్వహించిన కొవిడ్ టెస్టుల్లో ఇద్దరికి పాజిటివ్గా తేలిందన్నారు. ఆలేరు మండలంలోని కొలనుపాకలోఉపాధికూలీలు పనిచేసే ప్రాంతాల్లోమాస్క్లు ధరించాలని పంచాయతీ కార్యదర్శి తిరుపతిరెడ్డి సూచించారు.
కొవిడ్ టీకా పంపిణీ
ఆలేరు టౌన్, ఏప్రిల్ 16 : ఆలేరు పట్టణంలోని కమ్యూని టీ హెల్త్సెంటర్, పోచమ్మగుడి వద్ద శుక్రవారం పలువురికి వైద్యాధికారులు కొవిడ్ టీకాలను పంపిణీ చేశారు. ఈ కా ర్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పరమేశ్వర్, సునీతారమణారెడ్డి, నాగమణి, నర్సింహులు, వెంకటేశం, శ్రీనివాస్, బాలస్వామి, సంపత్ పాల్గొన్నారు.
వలిగొండలో 20 మందికి కొవిడ్
వలిగొండ, ఏప్రిల్ 16: మండలంలోని వలిగొండ, వర్క ట్పల్లి, వేములకొండ పీహెచ్సీల్లో శుక్రవారం 83 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్గా తేలిందని డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు.
వెయ్యి మందికి కొవిడ్ టీకా..
భూదాన్పోచంపల్లి, ఏప్రిల్16 : మండలవ్యాప్తంగా శుక్రవారం వెయ్యి మందికి కొవిడ్ టీకా వేసినట్లు మండల వైద్యాధికారులు తెలిపారు. మండల పరిధిలోని మెహర్నగర్, జలాల్పూర్, ముక్తాపూర్ గ్రామాల్లో 45 ఏండ్లు నిండిన వారికి, పీహెచ్సీలో జర్నలిస్టులకు కొవిడ్ టీకాలు వేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు రజిత, స్వాతి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
మోటకొండూర్లో 816 మందికి ..
మోటకొండూర్, ఏప్రిల్ 16: మండల కేంద్రంలోని స్థానిక పీహెచ్సీతోపాటు వర్టూర్, చాడ, కాటేపల్లి , మాటూరు గ్రా మాల్లోని కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో శుక్రవారం 816 మందికి టీకా వేసినట్లు మండల వైద్యాధికారి రాజేందర్ నాయక్ తెలిపారు. పీహెచ్సీలో 25 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్గా తేలిందన్నారు.
నారాయణపురంలో 550 మందికి..
సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్ 16: మండలవ్యాప్తంగా 550 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి తెలిపారు. పీహెచ్సీలో 22 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
అడ్డగూడూరులో 550 మందికి..
అడ్డగూడూరు, ఏప్రిల్ 16: మండలంలోని గట్టుసింగారం, చిర్రగూడూరు, బొడ్డుగూడెం, కొండంపేట గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన మొబైల్ క్యాంపుల్లో 550మందికి కొవిడ్ టీకా వేసినట్లు మండల వైద్యాధికారి నరేశ్ తెలిపా రు. అదేవిధంగా 15మందికి కొవిడ్ పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్గా తేలిందన్నారు.
ఆత్మకూరు(ఎం)లో 537 మందికి..
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్16: మండల కేంద్రంలోని పీహెచ్సీ, సర్వేపల్లి, పల్లెపహాడ్, సింగారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ టీకాల పంపిణీ కేంద్రాలను మండల ప్రత్యేక ప్రోగ్రాం అధికారి బ్రహ్మయ్య శుక్రవారం పరిశీలించారు. మండలంలోని నాలుగు గ్రామాల్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాల్లో 537 మంది కొవిడ్ టీకా తీసుకున్నట్లు మండల వైద్యాధికారిణి ప్రణీష తెలిపారు.
మోత్కూరులో 439 మందికి ..
మోత్కూరు, ఏప్రిల్ 16: మండలంలో 439 మందికి కొ విడ్ టీకా వేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ కిశోర్ కుమార్ తెలిపారు. ముశిపట్లలో 169 మందికి, రాగిబావి, పనకబండ గ్రామాల్లో 163 మందికి, మండల కేం ద్రంలో ని పీహెచ్సీలో 107 మందికి వ్యాక్సిన్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ చైతన్య కుమార్, సర్పంచ్లు తిరుమలేశ్, నాగయ్య, విజయ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తుర్కపల్లిలో 412మందికి..
తుర్కపల్లి, ఏప్రిల్16 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు పెద్దతండా, బద్దుతండాలో శుక్రవారం 412 మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు. అదేవిధంగా స్థానిక పీహెచ్సీలో 60 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 19 మందికి పాజిటివ్గా తేలిందన్నారు.
కొవిడ్ కట్టడికి ముందుకు రావాలి
రామన్నపేట, ఏప్రిల్16: కొవిడ్ కట్టడికి ప్రజలు ముందుకు రావాలని స్వాతంత్య్ర సమరయోధుల సంఘం జిల్లా అధ్య క్షుడు మనోహర్పంతులు అన్నారు. 101 ఏండ్లు ఉన్న ఆయన రామన్నపేట ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ టీకా తీసుకున్నారు. లక్ష్మాపురం, ఎన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లను సర్పంచ్లు ఉప్పుప్రకాశ్, మహేందర్రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళా శాలలో పనిచేస్తున్న సిబ్బంది టీకా తీసుకున్నారు. రామన్న పేటలో ఒకరికి పాజి టివ్ వచ్చినట్లు రవికుమార్ తెలిపారు
గుట్టలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ
యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 16 : యాదగిరిగుట్ట మండలంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లకు ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా వచ్చి టీకా తీసుకుంటున్నారు. రేపాక స్వా మి, యాదగిరిగుట్ట ఎంపీపీ శ్రీశైలం బాహుపేట గ్రామంలో వ్యాక్సిన్ తీసుకున్నారు. సైదాపురంలో సర్పంచ్ శంకర్, మల్లాపురం సర్పంచ్ వెంకటయ్య, ఎంపీటీసీ సుజాతావీరయ్యలు టీకా వేయించుకున్నారు.
కొవిడ్తో మహిళ మృతి
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 16: కొవిడ్తో ఓ మహిళ మృతి చెందింది. నమాత్పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ గత 15 రోజుల క్రితం యాదగిరిగుట్టలోని తన కుమార్తె ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు జ్వరం రావడంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. దీంతో ఆమెను హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు ఆమె భర్త చికిత్స నిమిత్తం తీసుకెళ్లాడు. ఆ దవా ఖానలో ఐదు రోజుల పాటు చికిత్స పొందింది. అక్కడ ఉండడం ఇష్టంలేకపోవడంతో వైద్యులకు చెప్పకుండానే గత నాలుగు రోజులక్రితం స్వగ్రామానికి వచ్చి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లో ఉన్నారు. దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున మృ తి చెందింది. ఆమెమృతదేహాన్ని గ్రామస్తులు జేసీబీ సహా యంతో తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు.