కులమతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పెనుబల్లి, ఏప్రిల్ 15 : తెలంగాణ గాంధీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కులమతం బేధాలు లేకుండా అన్ని వర్గాలనూ ఆదరించే ఏకైక సీఎం ఆయనేనని స్పష్టం చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయా గ్రామ పంచాయతీల కార్యాలయాల్లో, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల్లో ఇళ్లల్లో గురువారం అందజేశారు. మండలంలోని రామచంద్రాపురం, ఏరుగట్ల, లంకపల్లి, మండాలపాడు, లంకాసాగర్, కోండ్రుపాడు, పాతకారాయిగూడెం, కొత్తకారాయిగూడెం, మర్లకుంట, ముత్తగూడెం, గణేశ్పాడు, కుప్పెనకుంట్ల, పాతకుప్పెనకుంట్ల, బయ్యన్నగూడెం, వీఎం బంజరు, పెనుబల్లి, గౌరారం, భవన్నపాలెం, లింగగూడెం, గంగదేవిపాడు, తాళ్లపెంట, బ్రహ్మాళ్ళకుంట, టేకులపల్లి గ్రామాల్లో రూ.64 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, రూ.14 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి ప్రజలు కూడా అండగా ఉండాలని కోరారు. జడ్పీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్ చెక్కిలాల మోహన్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్రావు, నీలాద్రి దేవాలయ చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, పాతకారాయిగూడెం సొసైటీ చైర్మన్ చింతనిప్పు సత్యనారాయణ, సీడీసీ చైర్మన్ ముక్కర గోపాల్ రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మందడపు అశోక్కుమార్, సీఐ కరుణాకర్, తహసీల్దార్ ఎం.రమాదేవి, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి, నాయకులు లక్కినేని వినీల్, చీకటి రామారావు, కనగాల సురేశ్బాబు, సర్పంచ్లు దొడ్డపనేని శ్రీదేవి, ఆళ్ల అప్పారావు, గోదా నర్సింహారావు, గువ్వల వెంకటరెడ్డి, ప్రసాద్, ఆవిటి మారేశ్వరరావు, కర్నాటి వీరభద్రారెడ్డి, నారుమళ్ల లక్ష్మీబాబు, తేజావత్ తావూనాయక్ తదితరులు పాల్గొన్నారు.