కూలీల కొరతను నివారించడానికి వ్యవసాయంలో యంత్రాల వాడకం తప్పనిసరైంది. ఇప్పటికే అనేక యంత్రాలు సాగులో రైతులకు సాయపడుతుండగా, తాజాగా ‘జవాన్ బేలర్’ అందుబాటులోకి వచ్చింది. వరిగడ్డితోపాటు జొన్న, మక్కజొన్న చొప్పను కట్టలు కట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది.
రాష్ట్రంలో వరి తర్వాత ఆరుతడి పంటలైన జొన్న, మక్కజొన్న పంటల సాగు భారీగా పెరిగింది. వీటి కోతల తర్వాత మిగిలే గడ్డి, చొప్ప పశువుల మేతగా ఉపయోగపడుతుంది. కానీ, పొలంలోంచి వీటిని సేకరించి, కట్టలుగా కట్టడం కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. పెద్ద కమతాల రైతులు కూలీలను పెట్టుకొని మరీ ఈ పని చేయాల్సి వస్తున్నది. అయితే, కూలీల కొరత, శ్రమను తగ్గించేందుకు
‘జవాన్ బేలర్’ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.