నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి రేపటితో తెరపడనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది.
ప్రచారానికి సీఎం కేసీఆర్ మరికాసేపట్లో ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు. మరో గంటలో హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ప్రారంభం కానుంది.
సభలో టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి.. భవిష్యత్లో ఇక్కడ చేపట్టబోయే అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు వివరించనున్నారు.
కేసీఆర్ సభ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో గత 20 రోజులుగా ప్రధాన పార్టీలు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆది నుంచి ప్రచారంలో టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్నది.
సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ అభ్యర్థి నోముల భగత్కు ఓటు వేయాలని టీఆర్ఎస్ నేతలు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి