పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 13: యువత క్రీడల్లో రాణించాలని జెడ్పీటీసీ గౌరమ్మ అన్నారు. మండలంలోని చిన్నకొత్తపల్లిలో గ్రామ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. పోటీలను జెడ్పీటీసీ గౌరమ్మ, టీఆర్ఎస్ మండల నాయకులు నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించడం వల్ల యువత ఉత్సాహంతో పాల్గొంటారని, పోటీల్లో చక్కటి ప్రావీణ్యం సాధిస్తే రాష్ట్రస్థాయిలో రాణించేందుకు వీలుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు విష్ణుయాదవ్ ఉన్నారు.
ముగిసిన కబడ్డీ పోటీలు
మండలంలోని పెద్దకారుపాములలో అయోధ్యనగర్ యూత్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు కబడ్డీ పోటీలు నిర్వహించారు. మంగళవారం ముగింపు కార్యక్రమం అనంతరం గెలుపొందిన జట్లకు బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీవర్ధన్రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సింగిల్విండో వైస్ చైర్మన్ రాజు, విద్యాకమిటీ చైర్మన్ ఖలీల్, యూత్ సభ్యులు ఉన్నారు.