ఎదులాపురం, ఏప్రిల్ 12: గ్రామాల ప్రజలకు మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ , పంచాయతీ రాజ్ శాఖలకు సంబంధించిన ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1,231 హాబిటేషన్లకు గాను 1,227 హాబిటేషన్లకు మిషన్ భగీరథ ద్వారా, 4 హాబిటేషన్లకు సోలార్ సిస్టం ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథకు సంబంధించిన వివరాలు ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులకు తెలుపాలని పేర్కొన్నారు. అదే విధంగా జిల్లాలోని 73 రైతు వేదికలకు మిషన్ భగీరథ కనెక్షన్లు ఇచ్చామని మిగతా పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కరోనా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ కింద గ్రామాల్లో సరఫరా చేసే నీటి ట్యాంకులను ప్రతి 15 రోజులకోసారి శుభ్రం చేయాలని ఆదేశించారు. అదే విధంగా క్లోరినేషన్ చేసుకునే బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలపై ఉందని పేర్కొన్నారు. సమావేశంలో డీపీవో శ్రీనివాస్, పంచాయతీ రాజ్ ఈఈ మహావీర్, డిప్యూటీ ఈఈలు, ఇంజినీరింగ్ సిబ్బంది, ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కస్టమర్లూ.. ఆ రోజు ఆర్టీజీఎస్ సేవలుండవ్..!
ఉగాది పచ్చడి తింటే లాభమేంటి?