హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): 2020 మార్చి 16 వరకు పాఠశాలల్లో పనిచేసిన వారంతా ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి అర్హులేనని విద్యాశాఖ తెలిపింది. స్టేట్ బోర్డుతోపాటు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి కూడా ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించింది. దీనిపై మార్గదర్శకాలను విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ శుక్రవారం విడుదలచేశారు.
పార్ట్-ఏలో పూరించేవి (టీచర్, సిబ్బంది)
ఉద్యోగి పేరు, జెండర్, తండ్రి/ భర్తపేరు, హోదా, బోధన/బోధనేతర సిబ్బంది, ఆధార్ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్యాంకుఖాతా, ఆధార్కార్డులో లింక్ అయిన మొబైల్ నంబర్, ఆహార భద్రతా కార్డు వివరాలు, రేషన్ షాపు నంబర్, గ్రామం/ మున్సిపల్ వార్డు, మండలం/ మున్సిపాలిటీ, జిల్లా. ఈ సమాచారమంతా సరైనదేనని స్వీయ ధృవీకరణ.
పార్ట్ -బీలో పూరించేవి (పాఠశాల)
పాఠశాల పేరు, గ్రామం/వార్డు, మండలం/ మున్సిపాలిటీ, జిల్లా, గుర్తింపు ఉన్నదా/లేదా, ఉంటే గుర్తింపు నంబర్, పాఠశాల వివరాలు (ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల), స్టేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఇతర బోర్డు గుర్తింపు వివరాలు, ప్రవేశాల సంఖ్య, టీచర్లు, సిబ్బంది సంఖ్య, ప్రధానోపాధ్యాయుడి పేరు, ఫోన్ నంబర్. ఈ సమాచారమంతా సక్రమమేనంటూ హెచ్ఎం స్వీయ ధృవీకరణ.