హన్మకొండ, ఏప్రిల్ 9: ఈ నెల 12న ము న్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వరంగల్కు రానున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ చెప్పారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై చీఫ్ విప్ దా స్యం వినయ్భాస్కర్తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు ఇటీవల హైదరాబాద్లో మంత్రి కేటీఆర్తో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, ఆయా పనుల ప్రగతి తీరును అధికారులతో చర్చించారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. రూపాయికే ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. కార్పొరేషన్లోని అంతర్గత రోడ్లు, మురుగునీటి కాల్వలు, పారిశుద్ధ్యం, పార్కు లు, ప్రణాళికాబద్ధంగా నగర నిర్మాణం, భవిష్యత్తు ప్రణాళికలు, తదితర పనులపై చర్చించారు. మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చే యాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, నగర కమిషనర్ పమేలా సత్పతిను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, డాక్టర్ తాటికొండ రాజయ్య, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నగర మాజీ మే యర్ గుండా ప్రకాశ్రావు పాల్గొన్నారు.