కొన్ని దేశాల్లో రూల్స్ ని ఖచ్చితంగా పాటిస్తారు. అది ఆదేశ అధ్యక్షుడైనా, ప్రధాని అయినా సరే పాటించి తీరాల్సింది. అక్కడ రూల్ ఫర్ ఆల్ ఒకటే ఉంటుంది. అలాంటి దేశాల్లో నార్వే కూడా ఒకటి. ఇప్పుడీ దేశ ప్రధానికి భారీ ఫైన్ వేశారు పోలీసులు. ఎందుకంటే ఆమె కోవిడ్ రూల్స్ ని బ్రేక్ చేశారు. కరోనా నేపథ్యంలో నార్వే ప్రభుత్వం కోవిడ్ రూల్స్ ని కఠినంగా అమలు చేస్తోంది. పార్టీలు, వేడుకలకు షరుతులతో కూడిన అనుమతి ఇస్తోంది. అయితే నార్వే ప్రధాని ఎర్నా స్లోబర్గ్ తన 60పుట్టినరోజుని కుటుంబసభ్యుల మధ్య జరుపుకున్నారు. ఓ రిసార్ట్ లో ఈ వేడుక జరిగింది. పార్టీలు, వేడుకల్లో 10మందికి మించి ఉండకూడదన్న రూల్ ఉంది. దీన్ని బ్రేక్ చేస్తూ ఆవిడ బర్త్ డే పార్టీని జరుపుకున్నారు. ప్రధాని ఎర్నా బర్త్ డేకి 13మంది కుటుంబసభ్యులు హాజరయ్యారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసినందుకు గానూ 20వేల నార్వేజియన్ క్రౌన్స్ అంటే మన కరెన్సీలో దాదాపు 2లక్షల రూపాయల ఫైన్ వేశారు.