పట్టా చేయించుకున్న రైతు భూమి మాయం
రైతుబంధు రాకపోవడంతో మీసేవలో వెరిఫై
అందులో మరొకరి పేరుతో భూమి
కలెక్టరేట్కు వచ్చిన బాధితుడు
తహసీల్దార్కు ఫిర్యాదు చేయాలన్న అధికారులు
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 6(నమస్తేతెలంగాణ): కాటా రం మండలంలో రెవెన్యూ బాగోతం బయటపడింది. వారస త్వంగా సంక్రమించిన భూమిని రైతు పట్టా చేయించుకోగా, అది మాయమైంది. ఆ రైతు స్థానంలో మరొకరి పేరు మార్పిడి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కాటారం మండలంలోని గారెపల్లికి చెందిన అడువాల రవీందర్కు బొప్పారం శివారులో సర్వే నంబర్ 71/2 లో 1.04 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి తన తాత, తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించగా బీ/177/09లో తన పేరున ఆర్ఓఆర్ పట్టాను పొందాడు. తెలంగాణ ప్రభుత్వం 2018లో ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్లో నమోదు చేసుకోగా, ఖాతా నంబర్ 327లో 1.04 ఎకరాల భూమి తన పేరున డిజిటల్ పట్టా దారు పాసుపుస్తకం వచ్చింది. అనంతరం రైతుబంధు డబ్బులు అతని ఖాతాలో జమవుతున్నాయి. అయితే గత వర్షాకాలంలో ఆ డబ్బులు జమ కాకపోవడంతో వ్యవసాయాధికారిని కలిశాడు. మీ సేవలో సరిచూసుకోమని ఏవో సూచించగా అప్పటికి ధరణి పోర్టల్ అందుబాటులోకి రాకపోవడంతో 1బీ తీసుకోలేదు. ప్రస్తుతం భూ మి వివరాలను చెక్ చేయగా సర్వే నంబర్ 71/2 భూమిలో 1.04 ఎకరాలను శనిగరం రామయ్య, తండ్రి పోచయ్య పేరుపై ఉంది. దీంతో తనకు న్యాయం చేయాలని బాధితుడు కలెక్టర్ కార్యాలయం లో సంప్రదించగా తహసీల్దార్కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట