గ్రామ సర్పంచ్కి ఎంపీ సంతోష్ అభినందన
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంగా ఎంపికైన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండ లం పర్లపల్లిని ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. పర్లపల్లి సర్పంచ్ మాదాడి భారతి నరసింహారెడ్డిని ఆదివారం ఆయన అభినందించారు. హరితహారం, గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా గ్రామంలో చేపట్టిన మెక్కల పెంపకం గురించి అడిగి తెలుసుకున్నా రు. రోడ్డుకు ఇరువైపుల, డివైడర్లలో, పల్లెప్రకృతివనంలో చెటు,్ల పూలమెక్కలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. గ్రామంలో సాధ్యమైనంత ఎక్కువ మెక్కలు పెంచే ప్రయత్నం చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్న టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి మాదాడి రమేశ్రెడ్డిని ఎంపీ ప్రత్యేకంగా ప్రశంసించారు. గ్రామాభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
గజ్వేల్ మార్కెట్ దేశానికే మోడల్
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించాలి
అగ్రకులాల పేదలు అభివృద్ధి చెందాలి