గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి 10.20 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…నియోజకవర్గంలోని 111 పనులను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను కేటాయించినట్లు తెలిపారు.
కందుకూరు మండలంలోని సరళ రావులపల్లి నుంచి పోతుబండ తండా వరకు 65లక్షలతో, దెబ్బగూడ నుంచి ముచ్చెర్ల వరకు 62లక్షలతో, మహేశ్వరం మండలంలోని ఘట్పల్లి నుంచి ఘట్పల్లి తండావరకు 65లక్షలతో, చిన్న తుప్రా నుంచి నల్ల చెరువు తండా వరకు 90లక్షలతో బీటీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. పనులు వెంటనే ప్రారంభించి, వానాకాలంలోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేశ్ చంద్రారెడ్డి, డీఈ శ్రీనివాస్రెడ్డి, ఏఈ అనిల్కుమార్ పాల్గొన్నారు.