న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 56,211 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,95,855కు పెరిగింది. వైరస్ ప్రభావంతో 24 గంటల్లో 271 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,62,114కు చేరింది. తాజాగా 27,028 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,13,93,021 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 5,40,720 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 6,11,13,354 డోసులు వేసినట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. సోమవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 7,85,864 కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 24,26,50,025 శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..