న్యూఢిల్లీ, మార్చి 25: కారు తదితర వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షను మరింత కఠినతరం చేయనున్నామని లోక్సభకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనిలో భాగంగా రివర్స్ గేర్లో వాహనాన్ని కచ్చితత్వంతో నడుపుతున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తారు. మొత్తంగా నైపుణ్య పరీక్షల్లో కనీసం 69 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ల వద్ద ఈ పరీక్ష గురించి అవగాహన కల్పించేందుకు ఎల్ఈడీ తెరపై వీడియో ప్రదర్శిస్తారని గడ్కరీ తెలిపారు.