ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
65మందికి సీఎం రిలీఫ్ ఫండ్,రైతు, సభ్యత్వ బీమా చెక్కుల పంపిణీ
భూత్పూర్, మార్చి 23: ప్రజల సంక్షేమం కోసం తెలంగాణలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని అన్నాసాగర్లో 65మంది లబ్ధిదారులకు రూ.27,69,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, మండలంలోని మద్దిగట్లలో ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుమ్మరి బాలరాజు భార్య భీమమ్మకు రూ.5లక్షల చెక్కు, వెల్కిచర్లలో పార్టీ సభ్యత్వం పొంది మృతిచెందిన ఆంజనేయులు కుటుంబ సభ్యులకు రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్యే ఆల మంగళవారం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక పథకం అమలయ్యేలా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా ఇంతమంచి పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం లేదని పేర్కొన్నారు.
రైతులకు రైతుబంధు, రైతుబీమా, వృద్ధులు, వికలాంగులకు ఆసరా, విద్యార్థులకు పాఠశాలల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉద్యోగులకు పీఆర్సీ, ఫిట్మెంట్ను ఇస్తున్న ఘనత ఒక్క కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. అన్నివర్గాల వారిని సంతృప్తి పరుస్తున్న ముఖ్యమంత్రి దేశంలోనే నెం 1 అని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపు పట్ల నియోజకవర్గంలోని నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీలు డాక్టర్ కదిరె శేఖర్రెడ్డి, నాగార్జునరెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్ గౌడ్, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, బాదేపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, రైతుబంధు మండలాధ్యక్షుడు నర్సింహగౌడ్, వైస్ ఎంపీపీ నరేశ్గౌడ్, విశ్వేశ్వర్, గోప్లాపూర్ సత్యనారాయణ, అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.