దాహార్తి తీర్చుకుంటున్న గిరిజనం
పనిచేయని మహారాష్ట్ర సోలార్ వాటర్ పంపు
తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంటాం : గిరిజనులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ):కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని వివాదాస్పద గ్రామాలు(తెలంగాణ-మహారాష్ట్ర పాలన) బోలాపటార్, అంతాపూర్లకు తెలంగాణ సర్కారు మిషన్ భగీరథ పథకం నీరే ఆధారమవుతున్నది. అయితే ఈ గ్రామాల మధ్య మహారాష్ట్రకు చెందిన పర్సుగూడ గిరిజన గ్రామం ఉంది. సుమారు 60 ఇండ్లు ఉంటాయి. ఈ గ్రామంలో మహారాష్ట్ర ప్రభుత్వం సోలార్ పంపు ద్వారా నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఇది ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో తెలియదు. మిషన్ భగీరథ పైప్లైన్ పర్సుగూడ గ్రామం వద్ద లీకేజీ అవుతున్నది. ఈ ప్రాంతంలో చిన్న కుండీ ఏర్పాటు చేసి నీటిని వాడుకుంటున్నారు. స్వరాష్ట్రం విస్మరించినా తెలంగాణ సర్కారు దాహం తీరుస్తున్నదని, సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటామని గిరిజనులు పేర్కొంటున్నారు.