భువనగిరి టౌన్, మార్చి 21 : హైదరా బాద్లోని సైనిక్పురి నుంచి భువనగిరికి మంచి నీరు అందించే కృష్ణా వాటర్ పైప్లైన్కు బీబీనగర్ వద్ద లీకేజీలు ఏర్పడగా ఆదివారం మరమ్మతులు చేపట్టా రు. ఈ పనులను మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా వాటర్ పైప్లైన్కు బీబీనగర్ వద్ద ఏర్పడిన లీకేజీలతో నీటి సరఫరాలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందన్నా రు. పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. మరమ్మ తు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
ప్రధాన రహదారితోపాటు పురవీధుల్లో ఎక్కడా చెత్తాచెదారం కనిపించకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ చైర్మన్ ఆంజనేయు లు అన్నారు. ఆదివారం ఉదయం ఆయన పట్టణంలో శానిటేషన్ పనులతోపాటు పారిశుధ్య కార్మికుల అటెండెన్స్ను పరిశీలించారు. కొవిడ్ సెకండ్ స్టేజ్ నేపథ్యంలో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్లతోపాటు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.