లక్నో: సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. ఆరంభంలో చిచ్చరపిడుగు షఫాలీ వర్మ(47: 31 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), ఆఖర్లో రిచా ఘోష్(44 నాటౌట్: 26 బంతుల్లో 8ఫోర్లు) ధనాధన్ బ్యాటింగ్తో అలరించడంతో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. హర్లీన్ డియోల్(31) కీలక ఇన్నింగ్స్తో రాణించింది.
టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్కు దిగగా టీనేజర్ షఫాలీ వర్మ సూపర్ ఇన్నింగ్స్తో అదరగొట్టి చక్కటి పునాది వేసింది. రెండో ఓవర్లోనే స్మృతి మంధాన(7) వికెట్ కోల్పోయినా.. షఫాలీ మాత్రం వెనక్కి తగ్గలేదు. క్రీజులో ఉన్నంత సేపు సఫారీ బౌలర్లను బెంబేలెత్తించింది.