మల్యాల, మార్చి 18: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో బుధవారం ప్రారంభమైన అఖండ హనుమాన్చాలీసా పారాయణం కొనసాగుతున్నది. రెండోరోజు గురువారం వేదమంత్రోచ్ఛారణల మధ్య 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించారు. ఈ సందర్భంగా కొడిమ్యాల మండలం గ్రామానికి చెందిన అంజన్న భక్తమండలి, మల్యాలకు చెందిన మఠాంజనేయస్వామి ఆలయ భజన బృందం కలిసి హనుమాన్చాలీసా పారాయణం 11 సార్లు నిర్విరామంగా కొనసాగించారు. ఆంజనేయస్వామి అర్చకులు ఉత్సవమూర్తులకు అభిషేకం, హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు జితేంద్రప్రసాద్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, ఆలయ ఏఈవో బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకుడు శ్రీనివాసశర్మ, జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్రావు, మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ జనగం శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, నాయకులు రఘు, నీలగిరి రాజేందర్రావు, తాటిపాముల రాజేందర్, వొల్లాల శ్రీనివాస్గౌడ్, శ్రీనివాస్రావు, కొక్కుల రాజు తదితరులు పాల్గొన్నారు.