కావలసిన పదార్థాలు: తెల్ల నువ్వులు: అర కప్పు, అవిసెలు: అర కప్పు, గుమ్మడి గింజలు: అర కప్పు, పొద్దు తిరుగుడు గింజలు: అర కప్పు, సబ్జా: అర కప్పు, ఎండు ద్రాక్ష : ఒక కప్పు, యాలకులు: రెండు లేదా మూడు.
తయారీ విధానం: ముందుగా అన్ని రకాల గింజల్నీ విడివిడిగా నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకుని చివరగా ఎండుద్రాక్ష, యాలకులు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. మెత్తగా అయిన మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని చిన్నచిన్న లడ్డూలు చుట్టుకుంటే సరి.