న్యూఢిల్లీ/సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని మండి ఎంపీ రామ్స్వరూప్ శర్మ(62) ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. శర్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆత్మహత్యకు కారణం తెలియలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.