సీఎంలతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, మార్చి 17: కరోనాపై పోరులో భారతదేశానికి ఉన్న విశ్వాసం అతివిశ్వాసంగా (ఓవర్ కాన్ఫిడెన్స్గా) మారవద్దని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటి వరకు సాధించిన విజయాన్ని చూసి నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని, భౌతికదూరం తదితర నిబంధనలను పాటించాలని కోరారు. కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్పై అన్ని రాష్ర్టాల సీఎంలతో మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభం అయ్యాక మోదీ సీఎంలతో భేటీ కావడం ఇదే తొలిసారి. కరోనా కేసులు మళ్లీ పెరగడంపై మోదీ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారిని నియంత్రించడానికి రాష్ర్టాలు వేగవంతమైన, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలన్నారు.