హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా విజృంభనపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ స్కూళ్లు, పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యార్థులు కరోనా భారిన పడుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ సోమేష్కుమార్, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6వ తరగతి నుంచి స్కూళ్లు కొనసాగుతున్నాయి. కరోనా విజృంభన నేపథ్యంలో 1 నుండి 8వ తరగతి వరకు స్కూళ్లను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోటు చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లుగా సమాచారం. పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.