‘బండి’ ఐటమ్ సాంగ్లాంటి వాడు
బీజేపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారు
కేంద్రం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని విశ్లేషించాలి
ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నది
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హన్మకొండ, మార్చి 12 : కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ బోగస్, అబద్ధాల పార్టీ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. శుక్రవారం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాక ముందు పరిస్థితి, వచ్చిన తర్వాత ప్రస్తుత పరిస్థితిని పట్టభద్రులు విశ్లేషించాలన్నా రు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను అన్ని విధాలా అణగదొక్కాలని చూస్తున్నదన్నారు. ఏడు సంవత్సరాలుగా కేంద్రం తెలంగాణకు అన్యాయం చే స్తోందని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇవ్వలేదని, రాష్ర్టాన్ని అప్పు లపాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నాడని, అతడు సినిమా లోని ఐటమ్ సాంగ్ లాంటి వాడని విమర్శించా రు. బీజేపీ నాయకుల అబద్ధపు మాటలు నమ్మి మరో సారి మోసపోకుండా పల్లా రాజేశ్వర్రెడ్డికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పట్టభద్రులను కోరారు.
పల్లా భారీ మెజార్టీతో గెలుస్తారు : బోయినపల్లి
పల్లా రాజేశ్వర్రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తాడనే విశ్వాసం ఉందని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. నాటి తెలంగాణ… ప్రస్తుత తెలంగాణ ఎలా ఉందనేది పట్టభద్రులు, మేధావి వర్గం ఆలోచించాలన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని ఆర్థిక ని పుణులే గణాంకాలతో వెల్లడించారన్నారు. ఎమ్మె ల్సీ ఎన్నికలో పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యో గులు పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపించాలన్నారు.
అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి..