కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. బుధవారం నందిగ్రామ్లో నామినేషన్ వేసిన మమత అనంతరం తనపై దాడి మీడియాకు తెలిపారు. కారు వద్ద కొందరు తనను తోసివేయడంతో కాలికి తీవ్ర గాయమైందని చెప్పారు. ఆ సమయంలో పోలీసులు ఎవరూ పక్కన లేరని, ఈ దాడి వెనుక కుట్ర ఉన్నదని ఆరోపించారు. దీంతో మమతను కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె పరిస్థితి మెరుగుపడటంతో పలు వైద్య సూచనలతో డిశ్చార్జ్ చేశారు.
మరోవైపు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజల సానుభూతి కోసం మమత దాడి ఆరోపణలు చేశారని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ విమర్శించాయి. కాగా, టీఎంసీతోపాటు ప్రతిపక్షాల ఫిర్యాదుతో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్నికల సంఘం, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితోపాటు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల నుంచి నివేదిక కోరింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.