జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పార్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. కాళేశ్వరంలో ఉదయం 5 గంటల నుంచే భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసారు. దాదాపు ఇప్పటి వరకు మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 50 వేల వరకు భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి.