న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం నాటి ట్రేడింగ్లో ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.112 పెరిగి రూ.44,286కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,174 వద్ద ముగిసింది. అమెరికన్ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మరింత బలహీన పడటమే దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదలకు కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధరలు కూడా బుధవారం స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.126 పెరిగి రూ.66,236కు పెరిగింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,110 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,711 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.78 అమెరికన్ డాలర్లు పలికింది.