బీజింగ్ : భారత్తో సరిహద్దుల్లో ఉద్రిక్తల వేళ చైనా తన రక్షణ బడ్జెట్ను 209 బిలియన్ డాలర్లకు పెంచింది. గతేడాదితో పోలిస్తే 6.8శాతం అధికంగా నిధులను కేటాయించింది. ఈ మేరకు రక్షణ బడ్జెట్పై చైనా పార్లమెంట్లో ప్రధాని లీ కేఖియాంగ్ ప్రకటన చేశారు. అయితే రక్షణ బడ్జెట్ పెంపును డ్రాగన్ దేశం సమర్థించుకుంది. తమ జాతీయ భద్రతను పటిష్టతే లక్ష్యమని పేర్కొంది. ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం, బెదిరింపులకు దిగడం లేదని చైనా ప్రతినిధి పేర్కొన్నారు. గతేడాది చైనా 1.268 ట్రిలియన్ యువాన్ల (సుమారు 196.44 బిలియన్ డాలర్లు)ను కేటాయించింది. గత ఆరు సంవత్సరాలుగా రక్షణ రంగానికి చైనా అధిక నిధులు కేటాయిస్తూ వస్తోంది. ఈ ఏడాదిలో 1.35 ట్రిలియన్ యువాన్లు ( సుమారు 209 డాలర్లు) వెచ్చించనుంది. చైనా రక్షణ బడ్జెట్ అమెరికా బడ్జెట్లో నాలుగో వంతు. 2021 ఆర్థిక సంవత్సరానికి అగ్రరాజ్యం 740.5 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా.. 2021లో తలసరి రక్షణ వ్యయం వెయ్యి యువాన్లు (154 డాలర్లు) కంటే తక్కువగా ఉంటుందని ఆ దేశ మీడియా తెలిపింది. బడ్జెట్ను ప్రధానంగా సిబ్బంది, శిక్షణ, పరికరాల కోసం వెచ్చిస్తోంది.