బాలీవుడ్ కండల వీరుడు నటుడే కాదు మంచి పెయింటర్ అన్న సంగతి చాలా మందికి తెలుసు. లాక్డౌన్ సమయంలో కుంచె పట్టి అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన సల్లూ భాయ్ వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే పెయింటింగ్లో సల్మాన్ ప్రతిభ గుర్తించిన నిర్వాహకలు బెంగళూరులో జరిగే ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్లో సల్మాన్ పెయింటింగ్లను ప్రదర్శించనున్నారు. ప్రముఖ భారత చిత్రకారుడైన రాజా రవి వర్మ పెయింటింగ్ చిత్రాలతో పాటు సల్మాన్ పెయింటింగ్స్ కూడా ఇందులో ప్రదర్శించనున్నారట. ఈ విషయాన్ని సల్లూ భాయ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
అబనీంద్రనాథ్ ఠాగూర్, వీఎస్ గైతోండే, రవి వర్మ వంటి అద్భుతమైన కళకారుల మధ్య నా పెయింటింగ్ ప్రదర్శించనుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది చాలా అరుదైన గౌరవం. అందరికి నా ధన్యవాదాలు అని సల్మాన్ తన సోషల్ మీడియా పేజ్లో తెలియజేశాడు. ప్రస్తుతం సల్మాన్ రాధే అనే చిత్ర షూటింగ్తో బిజీగా ఉండగా, ఈ సినిమా రంజాన్కు విడుదల కానుంది. ఇందులో దిశా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైగర్ 3’, ‘కబీ ఈద్ కబీ’ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.