రూ.28 కోట్లతో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సరఫరా
మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
చిలుపూరు, జూలై 12 : దేవాదుల ఎత్తిపోతల ద్వారా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రూ.28కోట్ల వ్యయంతో సాగునీరు అందించనున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. దీనికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. సోమవారం చిలుపూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మక్క-సారలమ్మ బరాజ్ను పూర్తి చేసి 100 టీఎంసీల నీటితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేలా ప్రణాళిక రూపొందించామన్నారు. నియోజకవర్గ రైతులకు సాగు నీరు అందించేందుకు రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కేశిరెడ్డి మానోజ్రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ కృష్ణారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ జనగామ యాదగిరి, నాయకుడు నరేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ జగన్మోహన్రెడ్డి, మాజీ జడ్పీటీసీ స్వామి నాయక్, నాయకులు సుదర్శన్, జగన్నాథం, రామ్దాసు, రాజేందర్, సంపత్కుమార్, బూర్ల శంకర్, చిగ్గురు విజయ్, రాములు పాల్గొన్నారు.