సుబేదారి, సెప్టెంబర్ 24 : ఒంటరిగా వెళ్తున్న యువకులను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న దంపతులతోపాటు ఓ బాలుడిని సీసీఎస్, మామునూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హనుమకొండలో ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిందితుల వివరాలను సీపీ తరుణ్జోషి వెల్లడించారు. వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన రేణుకుంట్ల సరిత, రాజేశ్ దంపతులు. కాగా, సరిత మట్టెవాడ పోలీసు స్టేషన్ పరిధిలో బ్లాక్లో సినిమా టికెట్లు విక్రయి స్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే ది. ఇదేసమయంలో రాజేశ్ను వివాహం చే సుకుంది, జల్సాలకు అలవాటుపడిన ఈ జం ట వ్యభిచారం ముసుగులో ఒంటరిగా కనిపించిన యువకులను ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి డబ్బులు గుం జుకునేది. ఈ తరహాలో అనేకసార్లు దోపిడీలకు పాల్పడ్డారు. 2018లో సంవత్సరంలో మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని బెదిరించి రూ.12వేల నగదు, సెల్ఫోన్ చోరీచేసిన ఘటనలో ఈ జంట జైలుకు వెళ్లింది. ఈ నెల 19న కరీంనగర్ నుంచి వరంగల్ బ స్టాండ్లో దిగిన ఓ వ్యక్తిని ఆటోలో ఎక్కించుకుని శంభునిపేట మీదుగా గుంటూరుపల్లి గ్రామ శివారు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లిన సరిత.. భర్తకు, మడికొండకు చెంది న ఓ బాలుడికి ఫోన్చేసి అక్కడికి రప్పించిం ది.
సదరు వ్యక్తిని కొట్టి బ్యాగులోని రూ.70 వేల నగదు, బ్యాగును లాక్కొని ముగ్గురు బైక్పై అక్కడి నుంచి పారిపోయారు. ఈఘటనపై మామునూరు పోలీసులు కేసు నమో దు చేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారం గా నిందితులను గుర్తించారు. పక్కా సమాచారంతో తిమ్మాపూర్ క్రాస్రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈముగ్గురు నిం దితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.58 వేల నగదు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ డీసీపీలు వెంకటలక్ష్మి, పుష్ప, సీసీఎస్ ఏసీపీ బాబురావు, మామునూరు ఏసీపీ నరేశ్కుమార్, సీఐలు ఎల్ రమేశ్కుమార్, బీ రమేశ్, సీసీఎస్ ఎస్సై సంపత్కుమార్, సిబ్బంది శ్రీనివాస్రాజు, పర్వీన్, రవికుమార్, షరీఫుద్దీన్, జంపయ్య మహిళా కానిస్టేబుళ్లు లీనా, లావణ్యను సీపీ అభినందించారు.