హసన్పర్తి, సెప్టెంబర్ 23 : మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెలి ్లదయాకర్రావు పిలుపునిచ్చారు. గ్రేటర్ 66వ డివిజన్ హసన్పర్తి చెరువులో ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి గురువారం చేప పిల్లలు వదిలారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులు అంతరించి పోకుండా అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. గత పాలకులు ముదిరాజ్లను పట్టించుకున్నా పాపాన పోలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజ్లకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకున్నదని పేర్కొన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితులకు రూ.10 లక్షలు ఇస్తున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని చెరువులు, కుంటలు నింపి ముదిరాజ్లకు చేపలు పట్టుకునే హక్కును ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ మత్స్యకారుల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రమేశ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ముఖ్య మంత్రి కేసీఆర్ మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, సామగ్రిని ఇచ్చారని పేర్కొన్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు మాట్లాడుతూ హసన్పర్తి మండలంలోని 61 చెరువుల్లో12 వేల చేప పిల్లలు విడుదల చేయనున్నట్లు అన్నారు. మత్స్య కారులకు నేరుగా సబ్సిడీ రుణాలు అందాయని సూచించారు. మత్స్య సహకార సంఘం హసన్పర్తి మండల అధ్యక్షుడు పిట్టల కుమారస్వామి, సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు బుస్స మల్లేశం, కార్పొరేటర్ శివకుమార్, ఎంపీపీ సునీత, జడ్పీటీసీ సునీత, టీఆర్ఎస్ 66వ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, మార్కెట్ డైరెక్టర్ చకిలం రాజేశ్వర్రావు, ఎర్రగట్టుగ్టు ఆలయ చైర్మన్ పిట్టల సదానందం, జిర్ర అనిల్, బొడ యుగేంధర్, వీసం సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
గౌడ కులస్తులకు మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు హసన్పర్తి ఎల్లమ్మ ఆలయం వద్ద గురువారం గౌడ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరయ్యారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు వొల్లాల గణేశ్, యాదగిరి రఘుపతి, బొనగాని రమేశ్, పాపిశెట్టి శ్రీధర్, చకిలం రాజేశ్వర్రావు, చిర్ర సుమన్, డీకొండ భిక్షపతి, వొల్లాల శ్రీకాంత్ పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. ఎర్రగట్టుగుట్టలోని కేఎల్ఎన్ గార్డెన్లో1,2,55, 66 డివిజన్లలోని విలీన గ్రామాల టీఆర్ఎస్ అనుబంధ కమిటీల సభ్యులు, డివిజన్ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి, టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశనిర్దేశం చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ, అనుబంధ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కుడా డైరెక్టర్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ గుగులోత్ దివ్యారాణి, జక్కుల రజిత, మాజీ కార్పొరేటర్లు వెంకటేశ్వర్లు, రాజూనాయక్, కల్పనాసింగులాల్, డివిజన్ల అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, చల్లా వెంకటేశ్వర్రెడ్డి, భూపాల్, పీఏసీఎస్ చైర్మన్ ఉదయ్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్ తదితరులు పాల్గొన్నారు.