కమలాపూర్, సెప్టెంబర్ 23 : తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కమలాపూర్ ప్రగతి వైపు పరుగులు పెడుతోంది. కోట్లాది రూపాయల నిధులతో ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు చేపట్టడంతో గ్రామ రూపు రేఖలు మారిపోయాయి. రూ.2.25కోట్ల కుడా నిధులతో పరకాల-హుజూరాబాద్ ప్రధాన రహదారిపై శ్మశానవాటిక నుంచి సబ్ వ్యవసాయ మార్కె ట్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి వేళలో విద్యుత్ వెలుగులు జిగేల్మంటున్నాయి. సెంట్ర ల్ లైటింగ్తో కమలాపూర్ పట్టణాన్ని తలపిస్తోంది. అలాగే, ఏండ్ల తరబడి అంతర్గత రోడ్లు లేక ఇబ్బంది పడ్డ ప్రజలకు రూ.1.20కోట్లతో రోడ్లు వేస్తున్నారు. కమలాపూర్ బస్టాండ్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. ఏడేండ్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ అభివృద్ధిని విస్మరించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. నాలుగు నెలలు గా టీఆర్ఎస్ ప్రభుత్వం కమలాపూర్పై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి పనులు చేపడుతోంది. నిధులు కేటాయించడమే కాకుండా పనులు వెంటనే పూర్తి చేయిస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల తరబడి జరుగని అభివృద్ధి పనులు రెండు, మూడు నెలల్లోనే జరుగుతుండడంతో ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మ కం పెరుగుతోంది. కమలాపూర్లో పెం డింగ్ పనులు లేకుండా ప్రభుత్వం అభివృద్ధి చేపడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి పనులు జరుగకపోవడంతో అన్ని రకాలుగా ప్రజలు నష్టపోయారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం వస్తది? అనే వారికి ఈ అభివృద్ధి పనులే చెంపపెట్టు లాంటివి. ఇరవై ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన కమలాపూర్ను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి వైపు నడిపిస్తోంది.
ఇన్నేండ్లు ఈటల ఎందుకు చేయలేదు?
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఇంత అభివృద్ధి ఎందుకు చేయలేదు? ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు ఇచ్చినా అభివృద్ధి పనులు చేపట్టడంలో ఈటల నిర్లక్ష్యం చేశాడు. నాలుగు నెలలుగా ప్రభుత్వం కమలాపూర్లో చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తుంటే సంతోషమనిపిస్తుంది. మా ఊరులో చాలా మార్పు జరిగింది. పట్టణాన్ని తలపించేలా మారింది. స్వగ్రామం అంటున్న ఈటల రాజేందర్ ఏనాడు కమలాపూర్ అభివృద్ధిపై శ్రద్ధ చూపలేదు.