హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 26: హనుమకొండ బాలసముద్రంలోని స్విమ్మింగ్పూల్లో 6వ తెలంగాణ అంతర్ జిల్లాల సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ స్విమ్మింగ్, డైవింగ్ చాంపియన్షిప్ పోటీలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఆదివారం జరిగాయి. ముఖ్య అతిథిగా చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హాజరై పోటీలను ప్రారంభించారు. మొదటిసారిగా ఐదు విభాగాల్లో నిర్వహిస్తున్న ఈపోటీల్లో 250 మంది గర్ల్స్, బాయ్స్, సీనియర్స్, 50 మంది టెక్నికల్ అషీషియల్స్ పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి బెంగళూరులో జరిగే 37వ సబ్జూనియర్, 47వ జూనియర్స్, 74వ సీనియర్స్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వరంగల్పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభు త్వం ఆటలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మైదానాలను అభివృద్ధి చేస్తున్నదన్నారు. నేషనల్ అథ్లెటిక్స్ ఓపెన్ చాంపియన్షిప్ పోటీలు వరంగల్లో బ్రహ్మాండంగా నిర్వహించామని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ క్యాలెండర్ రూపొందించి, ప్రతినెలా ఒక ఈవెంట్ నిర్వహిస్తామన్నారు.
క్రీడాభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని వినయ్భాస్కర్ పేర్కొన్నారు. స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన వారందరికీ సోమవారం ఆత్మీయ విందును ఏర్పాటు చేస్తున్నట్లు చీఫ్ విప్ చెప్పారు.కార్య క్రమంలో స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ టీ సునీల్రెడ్డి, కార్యదర్శి మంచాల స్వామి చరణ్, జిల్లా అధ్యక్షుడు కే రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రెండురోజుల పాటు జరిగే స్విమ్మింగ్ అండ్ డైవింగ్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలను కల్పించామన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచినవారికి పతకాలతోపాటు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం డైవింగ్ పూల్ ఏర్పా టు చేయాలని అసోసియేషన్ సభ్యులు చీఫ్ విప్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పం దించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ ఛైర్మన్, ఒలింపిక్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజీజ్ఖాన్, డీవైఎస్వో గుగులోతు అశోక్కుమార్, కార్పొరేటర్ రావుల కోమల, వరంగల్ క్లబ్ కార్యదర్శి దొంతి రవీందర్ రెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు ఈవీ శ్రీనివాసరావు, డాక్టర్ తాళ్ల రవి, మండల పరశురాములు, స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్సింగ్, కోచ్ రాయబారపు నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.