హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 19: ఆర్టీసీకి దసరా పండుగ కలిసొచ్చింది. వారం రోజుల్లో రూ.12.49 కోట్లు ఆర్జించింది. గత సంవత్సరం రూ.9.24 కోట్లు రాగా, ఈసారి రికార్డుస్థాయిలో ఆదాయం సమకూరింది. కరోనా వైరస్ కారణం గా ఎనిమిది నెలలుగా నామమాత్రంగా నడిచిన బస్సులకు అంతంత మాత్రమే ఆదాయం వచ్చిం ది. ఈ క్రమంలో బతుకమ్మ, దసరా పండుగ సం దర్భంగా ఆర్టీసీ అదనపు సర్వీసులను ప్రారంభిం చింది. కరోనా కారణంగా ప్రజలు ఆర్టీసీ బస్సుల ను ఆశ్రయించడంతో ఖజానా నిండింది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.12,49,61,000 ఆదాయాన్ని ఆర్జించిన ఆర్టీసీ వరంగల్ రీజియన్ నంబర్ వన్ స్థానంలో నిలిచినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నా యి. బతుకమ్మ, దసరా పండుగకు పెంచిన అద నపు బస్సులతో ఈ నెల 8 నుంచి 18 వరకు రీజియన్ పరిధిలోని అన్ని డిపోలతో కలుపుకుని ఈ ఆదాయం వచ్చింది. శని, ఆది, సోమవారా ల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది.
39.77 లక్షల కి.మీ.. 4 లక్షల మంది ప్రయాణం
వరంగల్ రీజియన్ పరిధిలోని హనుమకొండ, జనగామ, వరంగల్-1, వరంగల్-2, మహబూ బాబాద్, నర్సంపేట, పరకాల, తొర్రూరు, భూ పాలపల్లి డిపోల నుంచి బతుకమ్మ, దసరా సంద ర్భంగా అదనంగా బస్సులను తిప్పారు. ఆయా డిపోల నుంచి 39.77 లక్షల కిలోమీటర్లు బస్సుల ను తిప్పగా సుమారు 4 లక్షల మంది ప్రయాణికు లను వారివారి గమ్యస్థానాలకు చేర్చారు. ఈ సంవత్సరం డీజిల్ ధరలు పెరిగినప్పటికీ ఎలాంటి అదనపు చార్జీలను వసూలు చేయకుండానే ప్ర యాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు. వరంగల్-1 డిపో పరిధిలో 6,62,357 కిలోమీ టర్లు తిప్పగా రూ. 2.34 కోట్ల ఆదాయం వచ్చిందని మేనేజర్ కేశరాజు భానుకిరణ్ తెలిపారు. అలాగే వరంగల్-2 డిపో పరిధిలో సోమవారం ఒక్కరోజే 55,843 కిలోమీటర్లకు రూ.22.27 లక్షల ఆదాయం సమకూరినట్లు మేనేజ ర్ బీ మహేశ్కుమార్ తెలిపారు.