కొత్తకోట: యువత నైపుణ్యం కలిగి ఉంటేనే వారు ఆర్థికంగా అభివద్ధి చెందుతారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీవేంకటేశ్వర ఐటీఐ కళాశాలలోనిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
యువత సంపద లేకపోతే చేడు మార్గం వైపు వెళ్తారని నైపుణ్యం ఉంటేనే ఏదో రంగాల్లో రాణిస్తారని అన్నారు. మంచి ఉద్దేశంతో నెలకోల్పిన ఈ కళాశాల పేరును అదే విధంగా కొనసాగించాలని, మంచి సంస్కృతితో ఈ కళాశాల నూతన కార్య వర్గం పాటుపడాలన్నారు. 30 సంవత్సరాలుగా ఉన్న పేరును పార్టీలకు అతితంగా పేద విద్యార్థుల కోసం కళాశాల పని చేస్తుందన్నారు. కళాశాల అభివృద్ధి కోసం తన నిధుల నుంచి రూ.5లక్షలు మంజూరు చేశారు.
నూతన అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే ఆల
శ్రీ వేంకటేశ్వర ఐటిఐ కళాశాల నూతన కార్యవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల రవీందర్నాథ్ రెడ్డి సమక్షంలో జరిగింది. నూతన అధ్యక్షుడిగా విశ్వనాథం గంగాధర్శెట్టి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ విశ్వేశ్వర్,
మార్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, కౌన్సిలర్లు కొండారెడ్డి, రాములు యాదవ్, రామ్మోహన్రెడ్డి, అయ్యన్న, తిరుపతయ్య, కోఆప్షన్ సభ్యులు వహిద్, వసీంఖాన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు బాబురెడ్డి, నాయకులు బాలకృష్ణ, సంధ్యశ్రీను, శ్రీనుజీ, సత్యంయాదవ్, జగన్, సుభాష్, అనిల్, యాదగిరి, స్టార్ ఆంజనేయులు, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.