వనపర్తి టౌన్: గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పనులను నాణ్యవంతంగా చేపట్టి సహకరించాలని గిరిజన అభివృద్ధి ఉమ్మడి జిల్లా అధికారులు వెంకటేశ్వరసింగ్, చక్రకుమార్లకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని గిరిజన కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు.
అదేవిధంగా జిల్లా కేంద్రంలోని గృహా కల్ప సమీపంలో ఉన్న గిరిజన వసతి గృహాంలో రూ.38లక్షలతో నిర్మించిన వంట గది, కామన్హాల్, కంపౌండ్ హాల్ నిర్మాణ పనులు పూర్తవగా వాటిని ప్రారంభించారు. అందులో రూ.30లక్షలతో కామన్ హాల్, వంటగది, రూ.8లక్షలతో కంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, మిగతా పనులు కూడా నాణ్యతతో చేపట్టి శాఖ అభివృద్దికి సహకరించాలని తనవంతు పూర్తి సహాయ సహాకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మంత్రి సూచించారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్, జడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారిని యాదమ్మ, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేశ్గౌడ్, దేవర్ల నరసిం హా, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, చీర్ల సత్యం, ఎల్ఐసీ కృష్ణ, పాకనాటి కృష్ణ, గొర్రె కాపరుల సంఘం డైరెక్టర్ పాల్గొన్నారు.